Bc Sadassu :విజయవాడలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం

-

Bc Sadassu on december 8th in vijayawada: విజయవాడలో డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలంలో బీసీ మంత్రులు, వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, బీసీలకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహించే అంశంపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని 10 వేల మందితో ఈ సమావేశం జరుపుతామని.. ఈ సమ్మేళనానికి సీఎం జగన్‌ను సైతం ఆహ్వానించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వైసీపీ బీసీల పార్టీ అని కొనియాడారు. బీసీ వర్గాలన్నీ వైసీపీకి మద్దతుగా నిలబడటంతోనే చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...