Bharat Jodo Yatra: ఏపీలోకి ప్రవేశించింన రాహుల్ గాంధీ

-

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే ఈ యాత్ర కోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. కర్నూలు జిల్లా చేత్రగుడి నుంచి పాదయాత్ర మెుదలు కాగా.. పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో మెుత్తం 4 రోజులు, 119 కి.మీ మేర రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది. నేడు ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నాం లంచ్‌ బ్రేక్‌లో పోలవరం నిర్వాసితులతో రాహుల్‌ ముచ్చటించనున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోతున్న తరుణంలో రాహుల్‌ గాంధీ చేస్తున్న ఈ యాత్ర, పార్టీ వర్గాల్లో జోష్‌ నింపింది. ఈ ఉత్సాహంతో, పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...