జేడీ లక్ష్మీనారాయణపై విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేసీఆర్‌ను దేవుడు అని పొగుడుతున్న లక్ష్మీనారాయణ(VV Lakshmi Narayana).. ఆంధ్రా నాయకులు ఆ వాటా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అజెండాను ఏపీలో అమలు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని విష్ణువర్థన్‌ రెడ్డి(Vishnuvardhan Reddy) ఆరోపించారు. అజెండా మోస్తున్న వారు ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించినట్లేనని అన్నారు. సీమ నీళ్లను దోచుకుంటున్న, ఆంధ్రా ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్‌(KCR)ను భుజాన మోయడం సిగ్గుచేటు అని విమర్శించారు. లేని సమస్యను సృష్టిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(Vizag Steel Plant)ను అమ్మేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్థన్‌ రెడ్డి అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గురించి జయప్రకాష్ నారాయణను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

- Advertisement -
Read Also: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు షురూ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...