వైఎస్ భాస్కర్ రెడ్డిని అందుకే అరెస్ట్ చేశాం: సీబీఐ

-

ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy)ని అరెస్ట్ చేసిన అనంతరం సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తెలిపింది. తొలుత గుండెపోటు అని ప్రచారం చేయడంతో పాటు సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా హత్యకు ముందు, తర్వాత నిందితుడు సునీల్ యాదవ్ ఆయన ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. హత్య జరిగే ముందు రోజు 2019 మార్చి14న భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ ఉన్నాడని.. ఆ సమయంలో భాస్కర్ రెడ్డి(Ys Bhaskar Reddy) తన 2ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడంది. అలాగే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమికి అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy), భాస్కర్ రెడ్డి కృషి చేశారంది. ఆ ఓటమి అనంతరం వారిద్దరిపై వివేకా(YS Viveka) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వివేకా ఉంటే రాజకీయ ఎదుగుదల ఉండదని భావించిన వారు.. ఆయనను అడ్డు తొలగించుకునేందుకు పక్కా ప్లాన్ వేశారని అనుమానాలు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది.

- Advertisement -
Read Also: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...