అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో ప్రమేయం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా(Collector Girisha)పై సస్పెన్షన్ వేటు వేసింది. 2021లో జరిగిన తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా గిరీషా ఉన్నారు. ఆ సమయంలో ఈఆర్‌వోగా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడీని అధికార వైసీపీ నేతలకు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. గిరీషా(Collector Girisha) లాగిన్ ఐడీ ద్వారా 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసినట్లు తేలింది. దీంతో గిరీషాను సస్పెండ్‌ చేస్తూ సీఈసీ(CEC) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయనతో పాటు ప్రమేయం ఉన్న ఇతర అధికారుల వివరాలు కూడా ఆరా తీసే పనిలో ఉంది. అలాగే ఓటర్ల జాబితాలో అక్రమాలకు సహకరించిన మిగిలిన అధికారులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సాధారణ ఎన్నికలను సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Read Also: ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...