Bobbili TDP: బొబ్బిలి పసుపుమయం.. బాబు ప్రసంగం హైలైట్స్ ఇవే!!

-

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా రావడంతో ఆ ప్రాంతమంతా పసుపుమయం అయ్యింది. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల అవినీతిపై మండిపడ్డారు. ఆయన ప్రసంగం హైలైట్స్ ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.

- Advertisement -
ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు నాయుడి కామెంట్స్:

• నేను బొబ్బిలికి రావడం ఇదేమీ కొత్త కాదు…నేను సినిమా నటుడుని కాదు…కానీ ఈ జన సందోహం ఎందుకు వచ్చింది. ఇంతటి సభను ఎప్పుడూ చూడలేదు.
• శివుడు భస్మాసురుడుని నమ్మినట్లు…మీరు ఒక్క ఛాన్స్ కు పడి పోయి జగన్ రెడ్డిని నమ్మారు.
• ఇప్పుడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు… దీనికి ఒకటే మార్గం జగన్ రెడ్డిని ఓడించడం.
• ఎమ్మిగనూరు నుంచి చూస్తున్నా ఎక్కడ చూసినా జనమే జనం.
• నాకు మీటింగ్ లు కొత్త కాదు…కానీ స్పందన చూస్తే నాకే హుషారొస్తోంది.
• దారిలో పిల్లలు, యువకులు తరలివస్తున్నారు.
• యువత నీరాజనం పలుకుతున్నరు.
• మా భవిష్యత్ కాపాడాలని పిల్లలు కోరుకుంటున్నారు
• ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు
• డీజీపీ ఒక్క సారి టీవీ చూడు….మీరు ఈ జనాన్ని కంట్రోల్ చేస్తారా.?
• బొబ్బిలి సభ చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుస్తోంది.
• ఇక్కడ ఉన్న పోలీసులను అడుగుతున్నా మీ బకాయిలు ఇచ్చరా…మీ జీపీఎఫ్ లు ఇచ్చాడా.?
• అన్ని వర్గాలకు ఇప్పుడు ఇదేం ఖర్మ..?
• జగన్ రెడ్డి నేను ఎక్కడ ఉంటాను అని అడుగుతున్నాడు.?
• ఈ బొబ్బిలి కోటలో చూడు….ప్రజల హృదయాల్లో ఉంటా..వాళ్ళ మనసుల్లో ఉంటా.
• తెలుగు వారికి ఆత్మవిశ్వాసం ఇచ్చాను.
• తెలుగువారు అమెరికాలో ఉన్న, తమిళనాడులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వాళ్ళతోనే ఉంటా.
• ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఉంటా. జగన్ రెడ్డి ఇదే నా సమాధానం. (వీడియో లింక్ కింద ఉంది చూడవచ్చు)

• జగన్ రెడ్డి నా రాజకీయ అనుభవమంత లేదు నీ వయసు. నీ నాన్న కూడా తోక తిప్పలేదు.
• మీరు రాజకీయం చేస్తే నేనూ రాజకీయం చేస్తా…
• ప్రజల ఆస్తులు, వారి భవిష్యత్ ముఖ్యం నాకు.
• రాష్ట్రంలో ఇసుకకు రెక్కలు వచ్చాయి.
• తాడేపల్లి ప్యాలెస్ కాదు….అది నకిలీ ప్యాలెస్.
• బాదుడే బాదుడుతో పన్నులు వేస్తే ప్రజలు నాడు ప్రశ్నించలేదు. ఇప్పుడు బాదుడు దెబ్బకు ఇక బయటకు వస్తున్నారు
• పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఎక్కువ
• కరెంట్ చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి.
• నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
• ఇంటిపన్ను, చెత్త పన్ను తో బాదేస్తున్నారు.
• చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం ఈ జగన్.
• అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఈ కార్యక్రమం తెచ్చాను.
• నిన్న కేంద్ర మంత్రి అన్నారు…ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు గానీ…పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకుంటారని.
• నా మీటింగ్ ఫెయిల్ అని సాక్షి వాళ్ళు రాస్తున్నారు..వాళ్ళు అసాక్షి.
• సాక్షితో పాటు టీవీ9, NTV అనేవి బ్లూ మీడియా.
• వాళ్లకు సమస్యలు కనపడవు. ప్యాకేజీలు మాత్రమే కనిపిస్తాయి.
• బుద్ది ఉంటే ఈ సీఎం ఇకనైనా మారాలి.
• వీలైనంత తొందరగా వైసీపీని కాంక్రీట్ తో సమాధి చెయ్యాలి
• అన్న క్యాంటీన్ నిలిపివేశారు…ఇక్కడ బేబీ నాయన భోజనం పెడతాను అంటే వద్దు అంటాడు ఈ సీఎం.
• రూ.200 పించన్ ను రూ.2000 చేసింది టీడీపీనే.
• మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే రూ.3000 ఇచ్చే వాళ్ళం
• ఈ జగన్ ఒక్క ఇల్లు కట్టడా? టిడ్కొ ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు..?
• ఇళ్లకు రంగులు వేసుకున్నాడు..కానీ ఇళ్ళు ఇవ్వలేదు.
• జగన్ రెడ్డి మూడున్నరెళ్ళలో 5 ఇళ్ళు కట్టాడు. ఈ మాట కేంద్రమే పార్లమెంట్ లో చెప్పింది.
• నీ సిగ్గు అనిపించలేదా జగన్.
• చంద్రన్న బీమా లేదు, విదేశీ విద్య లేదు…ఏమయ్యాయి ఈ పథకాలు.?
• రాష్ట్రంలో ఇప్పుడు రూ 9.50 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు ఎవరు కడతారు.?
• ఈ అప్పులు మన ఆదాయం అంతా సరిపోతుందా.?
• రైతు బజారు, తహసీల్దార్ ఆఫీస్ తాకట్టు పెట్టిన సీఎం జగన్. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు
• నాడు మద్యపాన నిషేదం అన్నాడు…ఇప్పుడు డబ్బులు తప్ప..ఆన్లైన్ చెల్లింపులు లేవు.
• ఉత్తరాంధ్రపై జగన్ కు ప్రేమలేదు….అస్తులపైనే ప్రేమ.
• దస్పల్లా భూములు ఎవరు కొట్టేశారు..?
• రుషికొండను బొడి గుండు చేశారు.
• నేను రుషికొండకు వెళ్తాను అని నిన్న రోడ్లు మూసేసాడు.
• సాక్షి గుమస్తా ఒకరు ఉన్నారు…రుషికొండ అంతర్జాతీయ సమస్యా అంటాడు.?
• కొండలు గుట్టలు కొట్టేస్తుంటే మనం వదిలి పెట్టాలా.?
• విశాఖలో ఉన్న అన్ని పరిశ్రమలు, పెట్టుబడులు పోయాయి.
• లులూ, అదాని సహా అన్నీ పోయాయి.
• ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి.
• అమరావతి రాజధాని, విశాఖ వాణిజ్య రాజధాని అవ్వాలి.
• నేను ప్రతిపాదించిన భోగాపురం విమానాశ్రయం ఏమయ్యింది..?
• ఒక్క పరిశ్రమ రాలేదు..ఉన్నవి అన్నీ మూత పడ్డాయి.
• యువతకు ఉద్యోగాలు లేవు….జాబు రావాలి అంటే బాబు రావాలని యువత కోరుకుంటోంది.
• అమరావతిలో మూడు లక్షల కోట్ల సంపద బూడిద పాలయ్యింది.
• అమరావతి రైతులు రోడ్డున పడటం రాష్ట్రానికి మంచిదా.?
• పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన ఘనత ఎవరిది.?
• ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఏమయ్యింది…ఎందుకు మూత పడింది.?
• సైకో సీఎం వల్ల షుగర్ ఫ్యాక్టరీ పోయిందని రైతులు చెప్పారు.
• రాష్ట్రం అన్ని రంగాలలో దెబ్బతింది.
• ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చింది ఎన్టీఆరే.
• డ్వాక్రా సంఘాలు పెట్టింది నేను. దీంతో వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి.
• ఆడపిల్లలకు మంచి అవకాశాలు ఇచ్చాను. రాబోయే రోజుల్లో వారికి రక్షణ గా నిలిచేది మనమే
• ఉద్యోగస్తులు భయపడ్డారు..పీఆర్సీ లేదు.
• నెలలో 23వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వడం లేదు.
• జీతాలు ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతాడా?
• విశాఖను గంజాయికి హబ్ గా చేసాడు..ఇది చాలా ప్రమాదం. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి.
• ఎక్కువ గంజాయి పట్టుకున్న రాష్ట్రం ఏపీ అని కేంద్రం చెప్పింది.
• పోలీసులు మాపై కాదు…సంఘ విద్రోహ శక్తులపై పోరాడాలి. గంజాయి, డ్రగ్స్ వల్ల ఆడపిల్లలపై దాడులు పెరిగాయి.
• ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రవాటా కేవలం వెయ్యికోట్ల..అదే తెలంగాణలో రూ.1.80 లక్షల కోట్లు ఉంది.
• ఈ సారి ఎన్నికల్లో ప్రజలు గెలవకపోతే రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలు. నాకు కాదు…రాష్ట్రానికే నష్టం.
• సమయం లేదు మిత్రమా…ప్రజా చైతన్యం రావాలి. రాష్ట్రంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మలు ఏంటి?
• సర్వే రాళ్లపై కూడా జగన్ బొమ్మలు ఏంటి? జగన్ కు ఫోటో పిచ్చి…రంగుల పిచ్చి పట్టింది. కేంద్రం జగన్ ను పిలిచి భారత్ రత్న ఇవ్వాలి ఇలాంటి దిక్కుమాలిన పనులకు.
• సర్పంచ్ లకు రాష్ట్రం లో విలువ లేదు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాసాడు.
• నా పర్యటనలో అనేక మంది వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. అనేక రంగాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు
• రాష్ట్రంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. కమీషన్ల కోసం చిన్న చిన్న వ్యాపారులను బెధరిస్తున్నారు.
• మనం వచ్చిన తరువాత స్వేచ్చగా వ్యాపారాలు చేసుకోవడానికి మంచి వాతావరణం కల్పిద్దాం.
• మూడున్నరేళ్ల తర్వాత అవినీతి చేయొద్దని మొన్న మంత్రులకు కేబినెట్ మీటింగులో జగన్ చెప్పాడు
• అంబటి రాంబాబు బాధితుడికి ఇచ్చిన రూ.5 లక్షల చెక్కులో సగం వాటా అడిగాడు. అంబటి పై చర్యలు తీసుకునే దైర్యం ఉందా ఈ సీఎంకు?
• కర్నూలులో మంత్రి జయరాం పేదల భూములు కొట్టేశాడు. ఇప్పుడు డబ్బులు కడితే వాళ్లకు తిరిగి భూములు ఇస్తాను అంటున్నాడు
• ఈ నియోజకవర్గం లో ఒక షాడో ఎమ్మేల్యే ఉన్నాడు…ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అవినీతి చేస్తున్నాడు
• బొబ్బిలిలో ఎమ్మెల్యే 1000 అడుగుల స్థలాన్ని కూడా వదలకుండా కొట్టేశాడు.
• జగన్ బటన్ నొక్కుడు కాదు…మొత్తం బొక్కుడే.
• ఉత్తరాంధ్ర లో సాయిరెడ్డి, సుబ్బా రెడ్డీ పెత్తనం ఎంటి?
• బొత్స, ధర్మాన ఎందుకు అడగలేకపోతున్నారు?
• రాష్ట్రంలో పెత్తనం అంతా సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డీ, పెడ్డిరెడ్డిలదే
• రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించడం సామాజిక న్యాయమా.?
• పేదలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం…. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చుతా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...