Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని… జీవితంలో తాను అనుకున్నవి సాధించాలని కోరుకుంటానని పేర్కొన్నారు. తమ్ముడు రాజకీయంగా ఎదగాలని తమ కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కాగా గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ పద్మవిభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్స్, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరి వల్లే తనకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వచ్చిందని తెలిపారు. అలాగే దివంగత నటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...