వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్‌ఓ.. సీరియస్ అయిన సర్కార్

-

వరద సహాయక చర్యలు తమ వీధిలో అందలేదని ప్రశ్నించినందుకు బాధితులపై వీఆర్ఓ జయలక్ష్మీ చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా సదరు బాధితులకు దుర్భాషలాడారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ సృష్టించింది. ఇదీ కూటమి సర్కార్‌లో వరద బాధితుల పరిస్థితి అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ అంశంపై కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సదరు వీఆర్వోపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆ విఆర్వోను విధుల నుంచి తొలగించామని కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా అందించామని తెలిపారు. వరద బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని, ఇటువంటి దురుసు ప్రవర్తన పనికిరాదని, ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు సూచించారు.

- Advertisement -

వరదల కారణంగా బాధలో ఉన్న బాధితులు ఒక మాట అన్నా ఓపికగా సమాధానం చెప్పాలని సీఎం గతంలో కూడా వివరించారు. కానీ కొందరు అధికారులు మాత్రం ఇంకా తలబిరుసు ప్రవర్తనే కనబరుస్తున్నారు. దీంతో అలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని చెప్పేలా ఈ వీఆర్వో వ్యవహారంలో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. తన చర్యలపై సదరు వీఆర్వో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

Read Also:  ‘విశ్వంభర’కు అంత బడ్జెట్ కుదరదంటున్న ఓటీటీ
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...