CM Jagan | మేనల్లుడి నిశ్చితార్థంలో జగన్.. అన్నాచెల్లెళ్ల మధ్య ఆసక్తికర సన్నివేశం

-

వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి(Raja Reddy), ప్రియా అట్లూరి(Priya Atluri) ల నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ వీరి ఎంగేజ్మెంట్ కి వేదిక అయింది. రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బంధువులు కార్యక్రమానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. సీఎం జగన్ దంపతులు కూడా మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరయ్యారు. వైఎస్ జగన్(CM Jagan), భారతి కలిసి రాజారెడ్డి, ప్రియా అట్లూరి లను ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముందుగా నూతన జంటతో కలిసి జగన్ దంపతులు ఫోటో దిగారు. అనంతరం గ్రూప్ ఫోటో దిగడానికి షర్మిలని తనవైపుకి పిలిచారు జగన్(CM Jagan). అయితే షర్మిల రాకుండా అక్కడే నిల్చుని ఫోటో దిగడానికి ప్రయత్నించారు. జగన్ మరోసారి పిలవడంతో షర్మిల భర్త ఆమెని ముందుకి రమ్మని పిలిచారు. కానీ షర్మిల మాత్రం బ్రదర్ అనిల్ పక్కకి వచ్చి నిలబడ్డారు. ఫోటో అనంతరం జగన్ అక్కడి నుండి బయలుదేరుతూ తల్లిని ఆలింగనం చేసుకున్నారు.

Read Also: పవన్‌కల్యాణ్‌కు ఐర్లాండ్ అభిమాని లేఖ.. కన్నీళ్లు పెట్టుకున్న జనసేనాని..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...