Guntur Church: చర్చిలో మళ్లీ రగడ.. కుర్చీలతో కొట్టుకున్న ఇరువర్గాలు

-

Guntur Church: గుంటూరులోని ఏఈఎల్‌సీ సంస్థలో మరోసారి రగడ మెుదలయ్యింది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం మాకుందంటే.. మాకే ఉందంటూ రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం రెండు వర్గాలకు చెందిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని నార్త్‌ ప్యారిస్‌ చర్చిలో పరదేశీబాబు, శ్యామ్‌ సంపత్‌ వర్గాలకు చెందిన పాస్టర్లు మధ్య వివాదం చెలరేగింది. చర్చిలో పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్‌ బాబురావు ప్రార్థనలు చేస్తుండగా.. తమకు కోర్టు అనుమతి ఇచ్చిందనీ.. శ్యామ్‌ సంపత్‌ వర్గం పాస్టర్‌ కెన్నెడీ (Guntur Church)చర్చిలోకి ప్రవేశించారు.

- Advertisement -

చర్చిలో ప్రార్థన చేసేందుకు తమకే అధికారం ఉందంటూ పరదేశీబాబు, శ్యామ్‌ సంపత్‌ వర్గాల పరస్పరం కుర్చీలతో దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్దకు భారీ చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఉదయకాల ప్రార్థనలు ముగియటంతో ఇరు వర్గాల పాస్టర్లను అలండల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాల పాస్టర్లు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

Read also: ఇలా కూడా స్మగ్లింగ్‌ చేస్తారా.. కస్టమ్స్‌ అధికారులు షాక్‌

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...