Dharmana Prasada Rao | రాజకీయాల్లో విసిగిపోయాను.. ఎన్నికల్లో పోటీ చేయను

-

ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి అని డిసైడ్ అయ్యానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి లో వైఎస్సార్ ఆసరా(YSR Asara) సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మాన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్ని, కార్యకర్తల్ని షాక్ కి గురి చేశాయి.

- Advertisement -

 Dharmana Prasada Rao

గత పాతికేళ్ళుగా ఎమ్మెల్యేగా పని చేస్తున్నానని, ఇక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) అన్నారు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) కి కూడా వివరించానని చెప్పారు. రాజకీయాల్లో విసిగిపోయానని, పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని చెప్పానన్నారు. నాకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా అధినేత జగన్ అంగీకరించడం లేదని తెలిపారు. పార్టీ కోసం ఈ ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేయాలని CM కోరారని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించాలని పేర్కొన్నారు.

Read Also: హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...