ఇప్పుడెందుకు వచ్చారు.. బొత్సకు వరద బాధితుల ఝలక్

-

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు వరద బాధితులు భారీ ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ వరద బాధితులు బొత్సను నిలదీశారు. ఇన్ని రోజులు వరద నీటిలో ఇబ్బందులు పడుతుంటే గుర్తుకు రాని తాము మాజీ మంత్రికి ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చామంటూ చురకలంటించారు.

- Advertisement -

వరద బాధితుల ఆగ్రహంతో వారిని పరామర్శించడానికి వెళ్లిన బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)కు ఊహించని షాక్ తగిలింది. వారికిక ఏం సమాధానం చెప్పలేని స్థితిలో నివ్వెరపోయారు మాజీ మంత్రి. అంతేకాకుండా తమకు సహాయం అందకుండా వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారంటూ వరద బాధితులు మండిపడ్డారు. వరద బాధితులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. అధికారంలో లేనోళ్లం ఏం చేస్తామంటూ బొత్స సత్యనారాయణ వెనుతిరిగారు. అయితే వరదలు ముంచెత్తినప్పటి నుంచి వైసీపీ తరపున జగన్, బొత్స మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వారి పర్యటన కూడా తూతూ మంత్రంగానే మారింది.

Read Also: 2,100 మందితో బురద తొలగింపు: చంద్రబాబు
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...