Vallabhaneni Balashowry | మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేనాని

-

మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. ఇందుకు సంబంధించి తుది కసరత్తు పూర్తైన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

కాగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి(Vallabhaneni Balashowry) ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం విధితమే. పొత్తులో భాగంగా జనసేన(Janasena)కు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించారు. ఇక 19 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను వెల్లడించారు. ఇదిలా ఉంటే నేటి నుంచి పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Read Also: కేటీఆర్‌ జైలులో చిప్పకూడు తింటాడు.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...