ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది: Pawan Kalyan

-

Janasena President Pawan Kalyan Responds Over Vizag King George Hospital Incident: వైజాగ్ కింగ్ జార్జ్ ఆసుపత్రి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో.. ఆ బిడ్డ తల్లితండ్రులు దాదాపు 120 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకువెళ్లడం తీవ్ర ఆవేదన కలిగించిందంటూ పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది. కానీ, ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు.

- Advertisement -

కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో దీనిని బట్టి అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి అంటూ పవన్(Pawan Kalyan) గురువారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...