Jayaprakash Narayan | ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన జయప్రకాశ్ నారాయణ

-

ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) తెలిపారు. కూటమికి మద్దతు ఇచ్చినందుకు తనపై కుల ముద్ర వేస్తారని.. దారుణంగా విమర్శలు కూడా చేస్తారని తెలిపారు. అయినా కానీ అభివృద్ధి చేసే కూటమికే తన మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. వారికి మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్థిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

- Advertisement -

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని వాపోయారు. సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని.. అభివృద్ధి కూడా చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని సూచించారు. గత ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయిందని.. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి.. కమ్మ, కాపులు విపక్షాల వైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? అనే అనుమానం కలుగుతోందని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అనే సందేహం కూడా ఉందన్నారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి పిల్లల భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతివ్వాలని జేపీ(Jayaprakash Narayan) పిలుపునిచ్చారు.

Read Also: కుటుంబానికే సాయం చేయని వారికి ఓటు వేయకండి: మంచు మనోజ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...