Jonnavithula | ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. పేరు ఇదే!

-

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు కాబోతుంది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(Jonnavithula Ramalingeswara Rao) ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి ఈ కొత్త పార్టీ అంశాన్ని ప్రకటించారు. తెలుగు భాషకు పునర్‌ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జొన్నవిత్తుల(Jonnavithula) అన్నారు.

- Advertisement -
Read Also:
1. గద్దర్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్!
2. ‘పేదలను హింసించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...