వెదర్ అలర్ట్: ఏపీలో ఈ జిల్లాల్లో చెట్ల కింద ఉండకండని హెచ్చరిక

-

Heavy Rains |నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులుతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు.. అల్లూరి జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో పిడుగులు ఎక్కువగా పడవొచ్చని పేర్కొంది. అందుచేత పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది.

- Advertisement -

మరోవైపు తెలంగాణ(Telangana)లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారు వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో వాతావరణం చల్లగా మారనుందని పేర్కొంది.

Read Also:
1. చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు.. సార్ క్షమించండని వేడుకోలు
2. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: బీజేపీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...