Karumuri Nageswararao: చంద్రబాబు డైరెక్షన్‌‌‌‌లో జనసేనని

-

Karumuri Nageswararao: టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌‌‌‌లో జనసేనని పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. యువతను పవన్ కళ్యాణ్ చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌‌తో చంద్రబాబు భేటీ కవడంతో పవన్‌‌ ముసుగు తొలగిపోయిందన్నారు. విశాఖ గర్జన జరిగే సమయంలో పవన్ నగరానికి రావాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కార్యక్రమాన్ని ముందే నిర్ణయించినప్పటికీ గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు వాయిదా వేసుకుని ఉండాల్సిందని.. జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువని.. ఈ తోకలేని కోతులు పవన్‌నే వాహనం నుంచి కింద పడేశాయని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం చూసి తట్టుకోలేక జనసేన గుండాలు మంత్రుల కార్లపై దాడులకు దిగారని మండిపడ్డారు. యువతకు పవన్ రౌడీయిజం నేర్పిస్తున్నారని, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswararao) ఆరోపించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...