వారం రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం.. ప్రకటించిన మంత్రి

-

ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్(RamPrasad Reddy) కీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని మరో వారం రోజుల్లో అమలు చేసేలా కసరత్తులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో ఈ పథకం అమలుపై సమీక్షలు నిర్వహిస్తున్నామని, అతి త్వరలో పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

- Advertisement -

‘‘రాష్ట్రంలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తాం. కాలం చెల్లిన బస్సులు తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తాం. ఆర్టీసీలో 7వేల మంది సిబ్బంది కొరత ఉంది. వీటి భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఈ 12న శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తాం. అనంతరం ఉచిత ప్రయాణం పథకంపై అధికారిక ప్రకటన చేస్తాం’’ అని చెప్పారాయన( RamPrasad Reddy).

Read Also: వైసీపీకి మరో షాక్.. మాజీ డిప్యూటీ సీఎం గుడ్‌బై
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...