Sidiri appalaraju: మా కడుపు కొడతామంటే ఊరుకోవాలా?

-

 అమరావతి రైతులను పాదయాత్రను ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామంటూ మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Sidiri appalaraju) వ్యాఖ్యానించారు. మా కడుపును కొడతామంటే చూస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ నేతలపై, అమరావతి రైతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 15న నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరిట మా గుండెలపై కొడతామంటే ఎలా ఒప్పుకుంటాం అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అన్నం తింటుంటే.. విశాఖను రాజధానిగా ఒప్పుకోవాలన్నారు. అసలు ఉత్తరాంధ్ర అచ్చెన్నకు ఏం అన్యాయం చేసిందని, విశాఖను రాజధానిగా ఒప్పుకోవటం లేదని (Minister Sidiri appalaraju) ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

చంద్రబాబు బాగుపడటానికే, అమరావతి పేరిట కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ అనంతరం రాజధాని అంటారు.. కర్నూలు వెళ్లి మనసంతా కర్నూలే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.. ఇప్పుడు విశాఖ వెళ్లి అదే మాట చెప్పారని ఎద్దేవా చేశారు. ఏ ప్రయోజనాల కోసం పవన్‌ ఇలా కొత్తమాటలు చెప్తున్నారు అని నిలదీశారు. పవన్‌ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసుకునేందుకు, ప్రజలంతా విశాఖ గర్జనకు తరలిరావాలని మంత్రి సీదిరి పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...