వికేంద్రీకరణ పేరిట అవాస్తవాలు చెప్తున్నారు: ఎంపీ కనకమేడల

-

మూడు రాజధానుల పేరిట ఉత్తరాంధ్రులను రెచ్చగొట్టి.. రైతుల పాదయాత్రపై దాడి చేయాలని కుట్ర జరుగుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వైసపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసిన తరువాత అనేక కుట్రలు పన్నుతున్నారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్‌, మంత్రులు వికేంద్రీకరణ పేరిట అవాస్తవాలు చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని విమర్శలు గుప్పించారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే జగన్‌ అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే.. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఉంటారో అని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజలను సీఎం జగన్‌ తప్పుదోవ పట్టిస్తున్నారనీ, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతే రాజధానిగా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ కనకమేడల మరోసారి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...