Janasena: అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేనాని

-

అవనిగడ్డ జనసేన(Janasena) అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. “అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. తదుపరి ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై నాయకులతో చర్చిస్తూ, అభిప్రాయ సేకరణ చేస్తున్నారు” అని తెలిపింది.

- Advertisement -

“మరోవైపు రైల్వేకోడూరు అభ్యర్థిగా యనమల భాస్కరరావును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై సర్వేలతో పాటు మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అవర శ్రీధర్‌కు అవకాశం కల్పించారు. కాగా టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కేటాయించడంతో బుద్ధప్రసాద్ జనసేన(Janasena)లో చేరి టికెట్ దక్కించుకున్నారు.

Read Also: వైసీపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...