Kandula Durgesh | మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఎవరంటే..?

-

ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ తాజాగా మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌(Kandula Durgesh)ను ప్రకటిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. కాగా రాజమండ్రి రూరల్ సీటు కోసం దుర్గేష్ పట్టుబట్టారు. అయితే టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఎలాగైనా తానే పోటీ చేస్తానని బుచ్చయ్య తెలిపారు. మొత్తానికి కొన్ని సంప్రదింపుల తర్వాత నిడదవోలు సీటు దుర్గేష్‌(Kandula Durgesh)కు కేటాయించడంతో బుచ్చయ్యకి లైన్ క్లియర్ అయింది.

- Advertisement -

పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 24 సీట్లలో ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. ఇందులో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, నెల్లిమర్ల లోకం మాధవి, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ పేర్లను జనసేనాని వెల్లడించారు.

Read Also:  జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకుందాం.. ప్రజలకు ముద్రగడ పిలుపు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...