Pawan Kalyan: నన్ను నమ్మితే ఓటు వేయండి.. సమస్యల పరిష్కారానికే జనసేన: పవన్

-

Pawan Kalyan meeting with kapu leaders: మీ సమస్యల పరిష్కారానికి జనసేన నిలబడుతుందని నమ్మితే జనసేనకు ఓటు వేయండి అని జనసేనని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో ఆయన భేటీ అయ్యారు. రిజర్వేషన్ల సర్టిఫికెట్లను పొందేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు జనసేననికి తెలిపారు. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు సర్టిఫికెట్లు అందచేసేందుకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తూర్పు కాపుల జనాభా లెక్కను వైసీపీ ప్రభుత్వం తగ్గించి చూపుతుందని టీడీపీ 26 లక్షల మందిని తూర్పు కాపులుగా గుర్తించిందని.. కానీ వైసీపీ ప్రభుత్వం 16 లక్షలే అంటోందని కావాలనే తూర్పు కాపుల జనాభాను తక్కువగా చూపుతున్నారని ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ సమస్యలను జగన్‌‌కు చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. నేను వైసీపీ నాయకుల్లా.. తేనే పూసిన కత్తిని కాదు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయన్నారు. కులంలో కొంతమంది కుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని Pawan Kalyan ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...

Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్‌...