Prathipati Sharath | టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

-

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాచవరం పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో విచారణ జరిపిన పోలీసులు శరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

- Advertisement -

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఎన్నికల వేళ ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని.. ప్రత్తిపాటి శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కంపెనీపై 2020లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...