Group 1 Exam | హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట.. గ్రూప్1 పరీక్ష రద్దుపై స్టే..

-

ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1(Group1 Exam) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రూప్‌-1 పరీక్ష రద్దు చేస్తూ.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసింది. అప్పటివరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.

- Advertisement -

కాగా 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను(Group1 Exam) రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మూల్యాంకనం రెండు, మూడు సార్లు చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో ఈ తీర్పును ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేసింది.

Read Also: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏం చర్చించారంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...

Prasanth Varma | మోక్షజ్ఞ లాంచ్.. రేస్ నుంచి తప్పుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma - Mokshagna | నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ...