RGV about Pawan Kalyan: కాపులను అమ్మేశాడంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు

-

RGV about Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశమైన వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. వీరి భేటీ పై పలు రాజకీయ ఊహాగానాలు లేవనెత్తాయి. పొత్తు పై చర్చించేందుకే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వీరి కలయికపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ పై ఒంటికాలతో లేచే వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ డబ్బు కోసం కాపులను కమ్మోళ్ళకి అమ్మేశాడంటూ రాజకీయ సంచలనానికి తెరలేపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని(RGV about Pawan Kalyan) ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు ???” అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వర్మ. ఆయన చేసిన ఈ పోస్ట్ పై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...