అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

-

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మందస్తు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. వెకేషన్ బెంచ్ ముందు సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా ఈ పిటిషన్ గురించి ప్రస్తావించగా.. రేపు విచారించడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. దీంతో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అవినాశ్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ(CBI) సైతం తమ వాదనలు వినిపించనుంది. కాగా తెలంగాణ హైకోర్టు మే31న జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందున బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అవినాశ్‌(Avinash Reddy)పై సీబీఐ మోపిన అభియోగాలు తీవ్రమైనవి అని అయితే హైకోర్టు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

Read Also:
1. జనసేన పార్టీలోకి ఆమంచి స్వాములు!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Nomination Withdrawal | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిది....