YS Jagan | సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఏపీ సీఎం జగన్‌‌(YS Jagan) అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐ అధికారులను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని చెబుతూ నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

- Advertisement -

అలాగే బెయిల్‌ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు నెలకు వాయిదా వేసింది. కాగా అక్రమాస్తుల కేసుల్లో జగన్(YS Jagan) బెయిల్ రద్దుతో పాటు కేసుల విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.

Read Also: కేజ్రీవాల్‌కు భారీ షాక్.. తిహార్ జైలుకు తరలింపు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...