TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

-

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

ట్రయల్ రన్ లో భాగంగా సోమవారం 5వేల మసాలా వడలు(Masala Vada) సిబ్బంది భక్తులకు వడ్డించారు. ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు చేశారు. ఈ వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని… పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో టీటీడీ(TTD) చైర్మన్ చేతుల మీదుగా కొత్తగా చేర్చిన వంటకంతో మెనూ ప్రారంభం కానుంది.

Read Also: హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...