TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

-

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు టీటీడీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తెలిపారు. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షెడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు, రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ చేపడతామన్నారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నామన్నారు.

రూ.23.50 కోట్లతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.3 కోట్లతో శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.9.85 కోట్లతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.2.6 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తామన్నారు.

అలాగే శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్లు, రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్ల కేటాయింపు చేశామని తెలిపారు. ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు, తిరుమతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ వెల్లడించారు. మరోవైపు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని టీటీడీ(TTD) ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్లు పొడిగించామన్నారు.

Read Also: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.25వేల వేతనంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...