వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాస్థలంలో దొరికిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష(Ninhydrin Test) జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉన్నందున ఈ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. 2021 ఫిబ్రవరి 11న లేఖను ఢిల్లీలోని CFSL ల్యాబ్‌కు సీబీఐ అధికారులు పంపారు. దీనిని పరీక్షించిన CFSL వివేకా తీవ్ర ఒత్తిడితో రాసిన లేఖగా నిర్ధారించింది. ఈ క్రమంలో లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని అధికారులు కోరగా.. అలా చేయాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో లేఖపై అనుమానితుల వేలిముద్రలు ఉన్నాయో? లేదో? నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.

Read Also:
1. టీడీపీ సీనియర్ నేత బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...