వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యాస్థలంలో దొరికిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష(Ninhydrin Test) జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉన్నందున ఈ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. 2021 ఫిబ్రవరి 11న లేఖను ఢిల్లీలోని CFSL ల్యాబ్‌కు సీబీఐ అధికారులు పంపారు. దీనిని పరీక్షించిన CFSL వివేకా తీవ్ర ఒత్తిడితో రాసిన లేఖగా నిర్ధారించింది. ఈ క్రమంలో లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని అధికారులు కోరగా.. అలా చేయాలంటే నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో లేఖపై అనుమానితుల వేలిముద్రలు ఉన్నాయో? లేదో? నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.

Read Also:
1. టీడీపీ సీనియర్ నేత బాబు రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Alapati Rajendra Prasad | కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ కూటమిదే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని...

Skincare Tips | సమ్మర్‌లో చర్మాన్ని ఇలా కాపాడుకోండి!

Skincare Tips | వేసవి వస్తుందంటే సవాలక్ష సమస్యలు కూడా ఇబ్బంది...