Midhun Reddy | ‘చంద్రబాబు ప్రతిసారీ ఎలా గెలుస్తున్నాడో అర్ధం కావడం లేదు’

-

గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతిసారీ ఎలా గెలుస్తున్నాడో నాకు అర్ధం కావడం లేదన్నారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కుప్పంలో ఉన్న ఓటర్ లిస్ట్‌లో దాదాపుగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించి ఉన్నారని మిథున్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బోగస్ ఓట్లను భారీగా నమోదు చేయించారని చెప్పాడు మిథున్ రెడ్డి. ఈ దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి విన్నవించామని మిథున్ రెడ్డి(Midhun Reddy) తెలిపారు. దొంగ ఓట్ల ద్వారా ఇంతకాలం చంద్రబాబు(Chandrababu) కుప్పంలో గెలుస్తూ వచ్చారని.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో మేము చూస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే రాబోతోందని జోస్యం చెప్పారు.

- Advertisement -
Read Also:
1. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలే వాటి ధరలు పడిపోవడానికి కారణం: చంద్రబాబు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...