ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.. 4 రోజుల తర్వాత చూస్తే..!!

-

Prakasam | ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే అద్దంకి మండలం జే పంగులూరు గ్రామానికి చెందిన సురేష్ (31) గత రెండు నెలలుగా కనిగిరిలోని ఓ డీఎస్సీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అందుకోసం స్థానికంగా ఉన్న ఇందిరా కాలనీ సమీపంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.

- Advertisement -

రోజూలానే నాలుగు రోజుల కిందట సురేష్ యధావిధిగా తన ఇంట్లో కి వెళ్లి తలుపు వేసుకున్నాడు. నాలుగు రోజులుగా తలుపు తీయకపోవడం, దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా మృతి చెంది కనిపించాడు. దీంతో కనిగిరి సీఐ పాపారావు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...