నంద్యాల పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి జగన్

-

మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల దాడికి గురైన వైసీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నంద్యాల(Nandyal) జిల్లా పర్యటన అనంతరం జగన్.. బెంగళూరుకు బయలుదేరనున్నారు. కాగా ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నారన్న సమాచారం లేదు. కాగా గతంలో కూడా జగన్.. బెంగళూరుకు వెళ్లారు. మాటిమాటికి జగన్.. బెంగళూరుకు వెళ్లడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరికొందరు మాత్రం ఆయన తన మోకాలి వైద్యం కోసం బెంగళూరు వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ జగన్.. బెంగళూరు ట్రిప్‌ వెనక అసలు కారణం ఏంటనేది తెలియలేదు.

- Advertisement -

దాంతో పాటుగా విశాఖ ఎమ్మెల్సీ ఉప ఉపఎన్నికలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన కసరత్తులు చేస్తున్నారు. అందుకోసే ఆయన ఉప ఎన్నికల బరిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను నిలబెడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో గెలిస్తే ఓ అద్భుతమైన బహుమానం ఇస్తానని కూడా జగన్(YS Jagan).. బొత్సకు ఆఫర్ చేశారని వాదన వినిపిస్తోంది. మరి ఆ ఆఫర్ ఏంటో చూడాలి.

Read Also: చైతూ, శోభిత ఎంగేజ్మెంట్.. అసలు విషయం చెప్పేసిన నాగార్జున
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...