YS Sharmila | తల్లి ఆశీస్సులతో ప్రచారానికి బయలుదేరిన షర్మిల

-

ఏపీలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్నా పీసీసీ ఛీప్ వైయస్ షర్మిల(YS Sharmila) అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రచారానికి బయలుదేరే ముందు తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు.

- Advertisement -

“దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను” ఆమె ట్వీట్ చేశారు.

శుక్రవారం నుంచి కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించారు. ఏప్రిల్ 12వరకు కడప జిల్లాలో షర్మిల(YS Sharmila) ప్రచారం సాగనుంది. అనంతరం మిగతా జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర జాతీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Read Also: వైసీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...