YS Sharmila | జగన్ తో ముగిసిన షర్మిల భేటీ.. ఆమె ఏం చెప్పారంటే?

-

తన సోదరుడు, సీఎం జగన్(CM Jagan) తో షర్మిల(YS Sharmila) భేటీ అయ్యారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్ళారు షర్మిల. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానిస్తూ జగన్ కి షర్మిల ఆహ్వాన పత్రిక అందించారు. దాదాపు 15 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె(YS Sharmila) మీడియాతో మాట్లాడుతూ… పెళ్లికి రావాలని జగన్ ని ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇది రాజశేఖర్ రెడ్డి మనవడి పెళ్లి అని, అందరి ఆశీస్సులు నూతన వధూవరులపై ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రత్యేక విమానంలో షర్మిల ఢిల్లీకి వెళ్లారు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అవనున్నారు. ఈ భేటీ తర్వాత వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సహా, భవిష్యత్తు కార్యాచరణ వివరాలు వెల్లడించనున్నారు.

Read Also: షర్మిల కాంగ్రెస్ లో చేరడం పై స్పందించిన జగన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...