సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

-

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) మరో బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ‘నవ సందేహాలు’కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

లేఖలో YS Sharmila లేవనెత్తిన సందేహాలు ఇవే..

1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?
2) సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?
3) 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ?
4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది?
5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?
7) SC, STలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా?
8) దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్థిస్తున్నారు?
9) స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?

ఇదిలా ఉంటే కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి బరిలో దిగారు. దీంతో అక్కడ పోరు నువ్వా నేనా రీతిలో ఉంది. మరి వీరిలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాల్సిందే.

Read Also: ఇప్పుడే నీ పేరు మార్చుకో.. ముద్రగడకు జనసేన నేత వార్నింగ్..

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...