YS Sunitha : జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు.. ప్రజలకు సునీతారెడ్డి పిలుపు.. 

-

ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి(YS Sunitha) పిలుపునిచ్చారు. వైసీపీ పునాదులు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసి ఉన్నాయని తెలిపారు. ఎవరినైనా ఒకసారి మోసం చేయగలరని.. పదేపదే మోసం చేయలేరని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

‘నేను, వైఎస్‌ షర్మిల ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నామని అంటున్నారు. నాన్న హత్య జరిగాక నాతో మీరు తోలుబొమ్మలాట ఆడుకున్నారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. ప్రజలు అంతా గ్రహిస్తున్నారు.. వాస్తవాలేంటో వారికి తెలుసు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేరని గుర్తుపెట్టుకోవాలి. అన్నగా తనకు సమాధానం చెప్పలేకపోయినా ఫర్వాలేదు.. సీఎంగానైనా చెప్పాలి” అని డిమాండ్‌ చేశారు.

“వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయి. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని… లేకపోతే పాపం చుట్టుకుంటుంది. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు. ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదు. నా తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దాం.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం” అని ప్రజలకు సునీత(YS Sunitha) పిలుపునిచ్చారు.

Read Also: ఏపీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. షర్మిల పోటీ ఎక్కడంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...