Supreme court: వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

-

YS Vivekananda Reddy case investigation supreme court: రాష్ట్రంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేక కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదని.. వేరే రాష్ట్రం నుంచి దర్యాప్తు జరిపించాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టి.. అక్టోబర్ 19న ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్నాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించి.. తీర్పును రిజర్వు చేసింది. నవంబర్ 21న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ధర్మాసనం ఈ కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. వచ్చే సోమవారం తీర్పు ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు (Supreme court) వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...