కొత్త వ్యాపారంలోకి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ

Reliance chief Mukesh Ambani enters new business

0
42
Mukesh Ambani, billionaire and chairman and managing director of Reliance Industries Ltd., pauses during a panel session at the World Economic Forum (WEF) in Davos, Switzerland, on Tuesday, Jan. 17, 2017. World leaders, influential executives, bankers and policy makers attend the 47th annual meeting of the World Economic Forum in Davos from Jan. 17 - 20. Photographer: Simon Dawson/Bloomberg

రిలయన్స కంపెనీ ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తుందో తెలిసిందే. దేశంలోనే ధనవంతుడు ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద కంపెనీలు ఆయన నడిపిస్తున్నారు. తాజాగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చీరల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అందులో భాగమైన రిలయన్స్ రీటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతోంది.

చీరలు మాత్రమే కాదు భారతీయ సాంప్రదాయ దుస్తుల అమ్మకాల కోసం అవంత్రా బ్రాండ్ నేమ్ తో స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఇక తొలి స్టోర్ బెంగళూరులో ఈ పండుగల సమయంలో స్టార్ట్ చేయనున్నారట. ఆ తర్వాత కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఏపీలో స్టోర్లను ఏర్పాటు చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్, టాటా గ్రూప్ కు చెందిన తనిష్క్ కు పోటీగా ఈ వ్యాపారాన్ని అంబానీ చేపట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్ధలు సాంప్రదాయ దుస్తుల వ్యాపారంలోకి వస్తున్నారు.
అవంత్రా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటు నల్లీ సిల్క్స్, పోతీస్ వంటి ప్రైవేట్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనుందట.