ఘోరం..10 మంది ప్రాణాలు తీసిన పాటల డీజే

0
47

వినోదం కోసం ఏర్పాటు చేసిన డీజే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బంగాల్​లోని కూచ్​ బెహార్​లో వ్యాన్​ లో డీజేతో పాటు 26 మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వాహనమంతా పవర్ సరఫరా అయింది. దీనితో వ్యాన్ లోని 26 మందిలో 10 మంది మరణించగా..మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే డీజే సిస్టమ్ జనరేటర్​ వైరింగ్​లో సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని సమాచారం అందుతుంది.