ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..20 మందికి గాయాలు

0
72

తెలంగాణ: ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. బాధితులను ఎమ్మెల్యే జోగు రామన్న వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు బాధితులను అంబులెన్స్‌లో రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఆదిలాబాద్‌ లోని జైనథ్‌ మం. నిరాల సమీపంలో జరిగింది. ప్రమాదం కారణంగా రహదారిపై నిలిచిన వాహన రాకపోకలు..భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.