Hyderabad | హైదరాబాద్ లో దారుణం.. బీజేపీ నేత ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి..

-

హైదరాబాద్(Hyderabad) లో దారుణ హత్య జరిగింది. యూసుఫ్ గూడా ఎలెన్ నగర్ లో బీజేపీ నేత మర్డర్ కలకలం రేపింది. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి, గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘోరానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..

- Advertisement -

Hyderabad | మృతుడిని పాలమూరుకు చెందిన సింగోటం రాముగా పోలీసులు గుర్తించారు. బీజేపీ నాయకుడైన రాముకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. అయితే రాము ఎలెన్ నగర్ కి తరచూ వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం బెడిసి కొట్టడంతో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాత్రి అక్కడికి వచ్చిన రాము ని బంధించి.. ప్రైవేట్ పార్ట్స్, గొంతు కేసి హత్య చేసినట్లు వెల్లడైంది. 10 మంది కలిసి మర్డర్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే డీసీపీ సాయి చైతన్య స్పాట్ కి చేరుకున్నారు. మర్డర్ జరిగిన తీరుపై పరిశీలించారు. స్థానికుల నుండి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: నా చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ని ప్రశ్నించిన షర్మిల..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...