దారుణం..పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్​​ రేప్​..డ్రగ్స్​ ఇచ్చి మరి..

Gang rape of a tenth grade student

0
60

దేశంలో మానవ మృగాల ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూస్తున్నాం. ఎన్ని కఠిన శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​లో దారుణ ఘటన జరిగింది.

ఓ బాలిక ట్యూషన్​ క్లాసులకు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో అక్కడే కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వేచి ఉన్నారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్​ ఇచ్చి నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు స్థానిక జన్సాథ్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ బబ్లూ సింగ్​ వర్మ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.