Vijayawada |యువతి ప్రేమ పంచాయితీ.. మేనమామ దారుణ హత్య

-

Vijayawada Crime |కాలం మారింది… టెక్నాలజీ పెరిగింది… ఆర్టిఫిషియల్ ఇన్టెలిజెన్స్ హవా నడుస్తోంది. మనుషులు చేసే పనులన్నీ రోబోటిక్స్ చేస్తున్నాయి. టెక్నాలజీకి కులంతో సంబంధం లేదు… మతంతో పట్టింపు లేదు!! అందరినీ సమానంగా చూస్తుంది. అవసరమైన వారికి సహాయం చేస్తుంది. ఆలోచించే శక్తి ఉన్న మనిషి మాత్రం ముందుకి కదలడం లేదు. కులాలు మతాలు అంటూ వెనకబడిపోయాడు. స్వలింగ వివాహాలకి అభ్యంతరం లేదంటూ చట్టాలు వచ్చినా.. ఆడ, మగ ప్రేమ వివాహాల్ని మాత్రం అంగీకరించడం లేదు. పరువు, ప్రతిష్టలు అంటూ పక్కవారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా ప్రేమ పంచాయతీ కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. విజయవాడ(Vijayawada) సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విజయవాడకు చెందిన నవీన్, ఒంగోలుకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇంట్లో తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి విషయంపై విజయవాడలోని ఖద్దూస్ నగర్ లో పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయితీ జరుగుతుండగా ఇరు కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో పెళ్లి కొడుకు అన్న జగదీష్, యువతికి మేనమామ వరసైన శ్రీనివాసును హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జగదీష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా జగదీష్ పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు.

Read Also: ‘సమంత చాలా చీప్’.. స్క్రీన్ షాట్స్ బయట పెట్టిన నెటిజన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...