ఘోరం..మసాజ్ పార్లర్ లో బాలికపై అఘాయిత్యం

0
60

దేశంలో రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు వంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పితంపురాలో ఒక మసాజ్ పార్లర్‌లో పని చేస్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు దుర్మార్గులు. తనపై పార్లర్ మేనేజర్, కస్టమర్ అత్యాచారం చేశాడని బాలిక ఆరోపించింది. పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.