Human sacrifice : దీపావళి అమావాస్య ఎఫెక్ట్.. హైదరాబాద్‌‌లో నరబలి కలకలం

-

Human sacrifice: హైదరాబాద్‌ నడబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ సమీపంలోని హైదర్‌నగర్‌లోని స్మశానంలో క్షుద్రపూజల అనంతరం నరబలి (Murder)ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. కొందరు దుండగలు ఓ యువకుడిని చంపి, తగలబెట్టారు. మంగళవారం అమావాస్య, అందులోనూ సూర్యగ్రహణం నేపథ్యంలో యువకుడిని బలి (Human sacrifice) ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిదో గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో యువకుడి అదృశ్యం కేసులను పరిశీలించనున్నారు. నిజంగా క్షుద్రపూజలు చేసి, నరబలి ఇచ్చారా, లేదా ఏదైనా తగాదాల్లో హత్య (Murder) చేసి ఉంటారా అన్న కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read also: రుణ యాప్‌ వేధింపులకు.. యువకుడు బలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...