ఫ్లాష్: విషాదం..అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం

0
69

అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం చెందడంతో విషాధచాయలు అలముకున్నాయి. జనవరి 19న జరిగిన ఘటనలో.. మృతులను తాజాగా గుర్తించారు. వీరు గుజరాత్‌కు చెందిన జగదీశ్‌ బల్‌దేవ్‌భాయ్‌ పటేల్‌, ఆయన భార్య వైశాలిబెన్‌ (37), కుమార్తె విహంగి జగదీశ్‌ కుమార్‌ పటేల్‌ (11), కుమారుడు ధార్మిక్‌ జగదీశ్‌ కుమార్‌ పటేల్‌ (3) అని కెనడియన్‌ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఓ మూడేళ్ల చిన్నారి సైతం ఉండటం విచారకరం. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.