స్నేహితులతో కలిసి హత్య..ఆ మృతదేహంతోనే స్టేషన్ కు..

Murder with friends..to the station with the dead body ..

0
71

కర్ణాటక బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరీ నగర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉండే మునిరాజు..ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఇందుకోసం అతడి స్నేహితులు సాయం చేశారు. అనంతరం ఆ మృతదేహంతో వారందరూ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు.

ములూర్​కు చెందిన మునిరాజు సోదరికి ఇటీవల వివాహమైంది. అయితే పెళ్లికి ముందే ఆమెకు భాస్కర్​ అనే వ్యక్తితో గత రెండేళ్లగా పరిచయం ఉంది. వివాహం తర్వాత కూడా వారి బంధం కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త.. భాస్కర్​తో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలో అతను మునిరాజుకు ఫోన్​ చేశాడు. అతను తన స్నేహితులతో కలిసి ఓ ఆటోలో వచ్చి భాస్కర్​ను ఓ నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. అక్కడే భాస్కర్​ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి వారందరు లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర నిందితులను మారుతి, నగేశ్​, ప్రశాంత్​లుగా పోలీసులు గుర్తించారు.